వర్షంతో యూఏఈ-స్కాట్లాండ్ వన్డే మ్యాచ్ ఆలస్యం
- December 11, 2019
షార్జా:ఈ ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా షార్జాలో వేదికగా జరగాల్సిన వన్డే క్రికెట్ మ్యాచ్ ఆలస్యం కానుంది. వరల్డ్ కప్ లీగ్ -2 లో భాగంగా ఈ రోజు యూఏఈ- స్కాంట్లాండ్ తో తలపడాల్సి ఉంది. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆకాశంలోని మేఘాలు క్లియర్ అయ్యాయి. సూర్యకాంతి కూడా వచ్చింది. అయితే..గ్రౌండ్ ఔట్ ఫీల్డ్ లో ఇంకా నీరు నిలిచి ఉండటం మ్యాచ్ ఆలస్యానికి కారణం అవుతోంది. గ్రౌండ్ స్టాప్ మైదానాన్ని డ్రైగా మార్చి మ్యాచ్ కు సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మ్యాచ్ కొనసాగాలంటే ఇరుజట్లు కనీసం 20 ఓవర్లైనా ఆడేంత సమయం ఉండాలి. ఒకవేళ మ్యాచ్ మధ్యాహ్నం 2.45 గంటల వరకల్లా ప్రారంభం కాకుంటే వన్డే పూర్తిగా రద్దు అవుతుంది. యూఏఈ, స్కాట్లాండ్ కు చెరోక పాయింట్ దక్కుతుంది. ఈ సీరిస్ లో యూఏఈ గత ఆదివారం యూఎస్ తో ఓ మ్యాచ్ ఆడి ఓడిపోయింది. స్కాట్లాండ్ కూడా యూఎస్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సిరీస్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జట్టు 2023లో భారత్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం సిరీస్ లో యూఎస్ టీం టాప్ పొజిషన్ లో ఉంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!