సోషల్ మీడియా సర్వీసులు పొందేందుకు షార్జాలో కొత్త నిబంధనలు

- December 13, 2019 , by Maagulf
సోషల్ మీడియా సర్వీసులు పొందేందుకు షార్జాలో కొత్త నిబంధనలు

ప్రకటనలు, ఇతర ప్రచారాలకు సంబంధించి  సోషల్ మీడియా సర్వీసులను పొందాలనుకునే ప్రభుత్వ శాఖలకు షార్జా ప్రభుత్వం కొత్త నిబంధనలను విధించింది. షార్జాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఇక నుంచి తప్పనిసరిగా షార్జా మీడియా ఆఫీస్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు షార్జా యువరాజు, షార్జా ఎగ్జిక్యూటీవ్ కమిటీ చైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖస్సిమి  డిక్రీ నెం.39, 2019ని జారీ చేశారు. ఈ తీర్మానం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వంలోని స్వతంత్ర సంస్థలు, ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న కంపెనీలు, ప్రభుత్వ అనుంబంధంగా నిర్వహిస్తున్న కంపెనీలు అన్ని కొత్త నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

ప్రకటనలు, ప్రచార సేవలను పొందే కాంట్రాక్ట్ లు పేయిడ్ అయినా నాన్ పెయిడ్ అయినా సరే ముందస్తుగా షార్జా మీడియా 
 సోషల్ మీడియా నిర్వాహకులతో ఒప్పందం చేసుకునే ముందే షార్జా మీడియా ఆఫీస్ నుంచి పారిపాలన అనుమతులు తీసుకోవాలి. ఈ కొత్త నిబంధన ఈ నెల 4 నుంచే అమల్లోకి వచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com