సోషల్ మీడియా సర్వీసులు పొందేందుకు షార్జాలో కొత్త నిబంధనలు
- December 13, 2019
ప్రకటనలు, ఇతర ప్రచారాలకు సంబంధించి సోషల్ మీడియా సర్వీసులను పొందాలనుకునే ప్రభుత్వ శాఖలకు షార్జా ప్రభుత్వం కొత్త నిబంధనలను విధించింది. షార్జాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఇక నుంచి తప్పనిసరిగా షార్జా మీడియా ఆఫీస్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు షార్జా యువరాజు, షార్జా ఎగ్జిక్యూటీవ్ కమిటీ చైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖస్సిమి డిక్రీ నెం.39, 2019ని జారీ చేశారు. ఈ తీర్మానం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వంలోని స్వతంత్ర సంస్థలు, ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న కంపెనీలు, ప్రభుత్వ అనుంబంధంగా నిర్వహిస్తున్న కంపెనీలు అన్ని కొత్త నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
ప్రకటనలు, ప్రచార సేవలను పొందే కాంట్రాక్ట్ లు పేయిడ్ అయినా నాన్ పెయిడ్ అయినా సరే ముందస్తుగా షార్జా మీడియా
సోషల్ మీడియా నిర్వాహకులతో ఒప్పందం చేసుకునే ముందే షార్జా మీడియా ఆఫీస్ నుంచి పారిపాలన అనుమతులు తీసుకోవాలి. ఈ కొత్త నిబంధన ఈ నెల 4 నుంచే అమల్లోకి వచ్చింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







