పాస్పోర్టులపై కమలం గుర్తు
- December 13, 2019
న్యూఢిల్లీ: కొత్త పాస్పోర్టులపై కమలం గుర్తు ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వివరణ ఇచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా నకిలీ పాస్పోర్టులను గుర్తించేందుకే కమలం చిహ్నాన్ని ముద్రించినట్టు ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. కేరళలోని కోజికోడ్లో లోటస్ గుర్తు ముద్రించిన కొత్త పాస్పోర్టులను జారీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవేంద్రన్ లోక్సభలో జీరో అవర్లో లేవనెత్తారు. కమలం బీజేపీ గుర్తు కనుక ఇలా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన రవీష్ కుమార్ ఆయన ఆరోపణలను కొట్టిపడేశారు. నకిలీ పాస్పోర్టులను గుర్తించడంతోపాటు భద్రతా పరమైన చర్యల్లో భాగంగానే కమలం గుర్తును ముద్రించామని, అది మన జాతీయ చిహ్నమని పేర్కొన్నారు. అది ఒక్క కమలం గుర్తుతో ఆగిపోదని, ఇతర జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్ పద్ధతిలో పాస్పోర్టులపై ముద్రిస్తామని వివరించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!