నైజర్:ఆర్మీ క్యాంప్లపై టెర్రర్ ఎటాక్...
- December 13, 2019
సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకు ఉగ్రవాదులు భీకర దాడులు జరపడంతో.. 71 మంది సైనికులు ప్రాణాలు విడిచారు. మరో 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నైజీరియాలోని నైజర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తిల్లబెరి ప్రాంతంలో మంగళవారం రాత్రి.. వందల సంఖ్యలో ఉగ్రవాదులు.. ఆర్మీ బేస్ క్యాంపులపై దాడికి దిగారు. అలర్ట్ అయిన సైన్యం కూడా.. ఉగ్రవాదులను ప్రతిఘటించింది. ఈక్రమంలో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అయితే మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో వందలమంది ఉగ్రవాదులు దాడులకు దిగడంతో.. 71 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరికొందరి ఆచూకి లభ్యం కాలేదు. తీవ్ర గాయాలపాలైన సైనికులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య దాదాపు మూడు గంటల పాటు.. భీకర కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఐసీస్ ప్రకటించుకుంది. ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో రెడ్ అలర్ట ప్రకటించారు.
ఇదిలా ఉంటే… గతవారం పశ్చిమ తహౌ ప్రాంతంలో కూడా సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!