ఆందోళనల నేపథ్యంలో భారత్ పర్యటించే ఎమిరాతీలకు యూఏఈ సూచనలు

- December 16, 2019 , by Maagulf
ఆందోళనల నేపథ్యంలో భారత్ పర్యటించే ఎమిరాతీలకు యూఏఈ సూచనలు

యూఏఈ:భారత్ లో పర్యటించే ఎమిరాతీలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీలోని యూఏఈ రాయబార కార్యాలయం జాగ్రత్త సూచనలు జారీ చేసింది. సిటిజన్ షిప్ అమెండ్మెంట్ బిల్లు-2019 నేపథ్యంలో ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తమ పౌరులకు ఈ జాగ్రత్త సూచనలు చేసింది. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించింది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 00919911120000 నెంబర్ కు కాంటాక్ట్ కావాలని పేర్కొంది.

గత రెండు రోజుల క్రితం సౌదీ అరేబియా, యూఎస్, యూకే కూడా తమ దేశ పౌరులకు ఇలాంటి సూచనలనే జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఈశాన్య ప్రాంతాల్లో పర్యటినలను మానుకోవాలని ఆయా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com