యూఏఈ: ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదాలు..వీడియో షేర్ చేసిన పోలీసులు
- December 18, 2019
యూఏఈ:వాహనదారులు హద్దు దాటిన వేగంతో కార్లను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని యూఏఈ పోలీసులు హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు కారు డ్రైవర్లు సృష్టించిన బీభత్సాన్ని వివరిస్తూ వీడియో షేర్ చేశారు. ఫోర్ వీలర్ జీఎంసీ, నిస్సాన్ SUV ఫాస్ట్ లేన్ పై ఒకదానికి
ఒకటి పోటీ అన్నట్లుగా పిక్ అప్ పెంచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు షేర్ చేసిన వీడియోలో స్పష్టమవుతోంది. ఫాస్ట్ లైన్ రోడ్డపై దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో అత్యంత ప్రమాదకరంగా వాహనాలను నడుపుతూ ఇతర వాహనాలను ఓవర్ టెక్ చేస్తూ వెళ్లిపోయారు. అంతేకాదు స్పీడ్ ను అలాగే కంటిన్యూ చేసిన వాహనదారులు సైడ్ బై సైడ్ వెళ్తూ ఒకరినొకరు తిట్టుకున్నట్లు వీడియోలో ద్వారా తెలుస్తోంది. హద్దు దాటిన వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ మీ ప్రాణాలు, ఇతర వాహనదారుల ప్రాణాలను రిస్క్ లో పెట్టొద్దని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. అలాగే వెహికిల్స్ ని పక్క పక్కనే కాకుండా రెండు వాహనాల మధ్య స్పేస్ మేయిన్టేన్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!