ఢిల్లీ:నిర్భయ నిందితుల పిటిషన్ తిరస్కరణ
- December 18, 2019
ఢిల్లీ:నిర్భయ కేసులో దోషులకు సమీక్ష కోరే హక్కు లేదని, క్షమాభిక్షకు కూడా అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్ కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. క్షమించరాని నేరం చేసిన వాళ్లు.. ఇప్పుడు రివ్యూ కోరడానికి అర్హులు కారని చెప్పింది. నిర్భయ కేసులో నలుగురు దోషులకు గతంలోనే సుప్రీం ఉరి శిక్ష వేసింది. రివ్యూ పిటిషన్లు కూడా ఇప్పుడు కొట్టేసిన నేపథ్యంలో.. త్వరలో శిక్ష అమలు ఖాయంగా కనిపిస్తోంది. ఐతే, అక్షయ్ సింగ్ తరపున వాదించిన అడ్వొకేట్ దీనిపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. నిర్భయ తల్లిదండ్రులు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









