యూఏఈ: ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదాలు..వీడియో షేర్ చేసిన పోలీసులు
- December 18, 2019
యూఏఈ:వాహనదారులు హద్దు దాటిన వేగంతో కార్లను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని యూఏఈ పోలీసులు హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు కారు డ్రైవర్లు సృష్టించిన బీభత్సాన్ని వివరిస్తూ వీడియో షేర్ చేశారు. ఫోర్ వీలర్ జీఎంసీ, నిస్సాన్ SUV ఫాస్ట్ లేన్ పై ఒకదానికి
ఒకటి పోటీ అన్నట్లుగా పిక్ అప్ పెంచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు షేర్ చేసిన వీడియోలో స్పష్టమవుతోంది. ఫాస్ట్ లైన్ రోడ్డపై దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో అత్యంత ప్రమాదకరంగా వాహనాలను నడుపుతూ ఇతర వాహనాలను ఓవర్ టెక్ చేస్తూ వెళ్లిపోయారు. అంతేకాదు స్పీడ్ ను అలాగే కంటిన్యూ చేసిన వాహనదారులు సైడ్ బై సైడ్ వెళ్తూ ఒకరినొకరు తిట్టుకున్నట్లు వీడియోలో ద్వారా తెలుస్తోంది. హద్దు దాటిన వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ మీ ప్రాణాలు, ఇతర వాహనదారుల ప్రాణాలను రిస్క్ లో పెట్టొద్దని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. అలాగే వెహికిల్స్ ని పక్క పక్కనే కాకుండా రెండు వాహనాల మధ్య స్పేస్ మేయిన్టేన్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







