యూఏఈ: ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదాలు..వీడియో షేర్ చేసిన పోలీసులు
- December 18, 2019
యూఏఈ:వాహనదారులు హద్దు దాటిన వేగంతో కార్లను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని యూఏఈ పోలీసులు హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు కారు డ్రైవర్లు సృష్టించిన బీభత్సాన్ని వివరిస్తూ వీడియో షేర్ చేశారు. ఫోర్ వీలర్ జీఎంసీ, నిస్సాన్ SUV ఫాస్ట్ లేన్ పై ఒకదానికి
ఒకటి పోటీ అన్నట్లుగా పిక్ అప్ పెంచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు షేర్ చేసిన వీడియోలో స్పష్టమవుతోంది. ఫాస్ట్ లైన్ రోడ్డపై దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో అత్యంత ప్రమాదకరంగా వాహనాలను నడుపుతూ ఇతర వాహనాలను ఓవర్ టెక్ చేస్తూ వెళ్లిపోయారు. అంతేకాదు స్పీడ్ ను అలాగే కంటిన్యూ చేసిన వాహనదారులు సైడ్ బై సైడ్ వెళ్తూ ఒకరినొకరు తిట్టుకున్నట్లు వీడియోలో ద్వారా తెలుస్తోంది. హద్దు దాటిన వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ మీ ప్రాణాలు, ఇతర వాహనదారుల ప్రాణాలను రిస్క్ లో పెట్టొద్దని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. అలాగే వెహికిల్స్ ని పక్క పక్కనే కాకుండా రెండు వాహనాల మధ్య స్పేస్ మేయిన్టేన్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- అంకిత భావంతో ప్రజలకు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









