యూఏఈ: అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..150 కుటుంబాల తరలింపు
- December 18, 2019
యూఏఈలోని ఫుజైరహ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అల్ ఖైల్ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల నుంచి సమచారం అందుకున్న సివిల్ డిఫిన్స్ అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో 48 అపార్ట్మెంట్ భవనాలు ఉన్నాయి. దీంతో మంటలు చుట్టుపక్కల బిల్డింగ్ లకు వ్యాపించకముందే భవనాల్లోని 150 కుటుంబాలను అగ్నిమాపక సిబ్బంది అక్కడ్నుంచి తరలించింది. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అపార్ట్మెంట్ ఏడో అంతస్తులోని కిచెన్ నుంచి మంటలు చెలరేగినట్లు ఫుజైరహ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ ఖలీద్ అల్ హమౌదీ తెలిపారు. మంటలు వేగంగా ఇతర గదులకు విస్తరించటంతో వస్తువులు తగలబడినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదాల సమయాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని నివారించేందుకు బిల్డింగ్ యజమానులు అగ్నిమాపక శాఖ సూచనలను పాటించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..