షార్జా-అజ్మన్ మధ్య తొలి ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం
- December 19, 2019
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పొల్యూషన్ కు విరుగుడుగా షార్జా రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు షార్జా-అజ్మన్ మధ్య తొలి ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ బుధవారం ప్రారంభించింది. తొలిగా ఆరు నెలల పాటు ఈ ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్సును ట్రయల్ చేసిన తర్వాత మరిన్ని సర్వీసులు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. చైనా షాంగన్ బస్ సంస్థకు చెందిన దుబాయ్ ఏజెంట్ రిలయన్స్ మోటర్స్ తో ఈ మేరకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రారంభమైన ఎలక్ట్రిక్ బస్సు షార్జాలోని అల్ జుబెల్ బస్టాండ్ నుంచి అజ్మన్ లోని అల్ ముసల్లా బస్ స్టేషన్ కు వెళ్తుంది. ఈ బస్సులో 27 మందికి సరిపడా సీటింగ్ కెపాసిటీ ఉంది. అలాగే 30 మంది వరకు నిల్చొవచ్చు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. ఆకుపచ్చని రంగులో ఉన్న ఈ బస్సులో బస్సు డ్రైవర్ సీటుకు ఓ ప్రత్యేక ఉంది. డ్రైవర్ కాకుండా ఇంకెవరు కూర్చున్న బస్సు ముందుకు కదలకుండా టెక్నాలజీ డెవలప్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు కూడా ఓ పద్దతిలో కూర్చోవాల్సి ఉంటుంది. ఈ మేరకు డ్రైవర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు.
రోజురోజుకు పోరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించటంతో పాటు పొల్యూషన్ ను కంట్రోల్ చేయటంలో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని SRTA చైర్మన్ యూసుఫ్ సలెహ్ అల్ సువైజి తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!