షార్జా-అజ్మన్ మధ్య తొలి ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం
- December 19, 2019
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పొల్యూషన్ కు విరుగుడుగా షార్జా రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు షార్జా-అజ్మన్ మధ్య తొలి ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ బుధవారం ప్రారంభించింది. తొలిగా ఆరు నెలల పాటు ఈ ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్సును ట్రయల్ చేసిన తర్వాత మరిన్ని సర్వీసులు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. చైనా షాంగన్ బస్ సంస్థకు చెందిన దుబాయ్ ఏజెంట్ రిలయన్స్ మోటర్స్ తో ఈ మేరకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రారంభమైన ఎలక్ట్రిక్ బస్సు షార్జాలోని అల్ జుబెల్ బస్టాండ్ నుంచి అజ్మన్ లోని అల్ ముసల్లా బస్ స్టేషన్ కు వెళ్తుంది. ఈ బస్సులో 27 మందికి సరిపడా సీటింగ్ కెపాసిటీ ఉంది. అలాగే 30 మంది వరకు నిల్చొవచ్చు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. ఆకుపచ్చని రంగులో ఉన్న ఈ బస్సులో బస్సు డ్రైవర్ సీటుకు ఓ ప్రత్యేక ఉంది. డ్రైవర్ కాకుండా ఇంకెవరు కూర్చున్న బస్సు ముందుకు కదలకుండా టెక్నాలజీ డెవలప్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు కూడా ఓ పద్దతిలో కూర్చోవాల్సి ఉంటుంది. ఈ మేరకు డ్రైవర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు.
రోజురోజుకు పోరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించటంతో పాటు పొల్యూషన్ ను కంట్రోల్ చేయటంలో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని SRTA చైర్మన్ యూసుఫ్ సలెహ్ అల్ సువైజి తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ, యూఏఈలపై డ్రోన్ దాడులను ఖండించిన ఎంపీలు..!!
- ఎన్నారైలు యూఏఈ నుండి డ్యూటీ ఫ్రీలో బంగారు నాణేలు తీసుకువెళ్లవచ్చా?
- పవిత్ర స్థలాల్లో పర్యటించిన మక్కా డిప్యూటీ ఎమిర్..!!
- ఒమన్లో నిర్మాణ సామగ్రి ధరలపై సీపీఏ కీలక ప్రకటన..!!
- డిజిటల్ రిమోట్ టవర్ వ్యవస్థతో 360-డిగ్రీల కవరేజీ: ఖతార్
- కువైట్-సౌదీ రైలు మార్గానికి ఆమోదం..!!
- శాన్ డియాగో మసీదులో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి
- యూఏఈలో 16 భారతీయ వీసా, కాన్సులర్ సేవా కేంద్రాలు ప్రారంభించనున్న అల్హింద్ గ్రూప్
- దుబాయ్లో 13 కమ్యూనిటీ క్లబ్లను ప్రారంభించిన AES
- డ్యూటీస్, వ్యాట్ ఛార్జీల కోసం 100-దీనార్ల పరిమితి..!!









