షార్జా-అజ్మన్ మధ్య తొలి ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం
- December 19, 2019పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పొల్యూషన్ కు విరుగుడుగా షార్జా రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు షార్జా-అజ్మన్ మధ్య తొలి ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ బుధవారం ప్రారంభించింది. తొలిగా ఆరు నెలల పాటు ఈ ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్సును ట్రయల్ చేసిన తర్వాత మరిన్ని సర్వీసులు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. చైనా షాంగన్ బస్ సంస్థకు చెందిన దుబాయ్ ఏజెంట్ రిలయన్స్ మోటర్స్ తో ఈ మేరకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రారంభమైన ఎలక్ట్రిక్ బస్సు షార్జాలోని అల్ జుబెల్ బస్టాండ్ నుంచి అజ్మన్ లోని అల్ ముసల్లా బస్ స్టేషన్ కు వెళ్తుంది. ఈ బస్సులో 27 మందికి సరిపడా సీటింగ్ కెపాసిటీ ఉంది. అలాగే 30 మంది వరకు నిల్చొవచ్చు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. ఆకుపచ్చని రంగులో ఉన్న ఈ బస్సులో బస్సు డ్రైవర్ సీటుకు ఓ ప్రత్యేక ఉంది. డ్రైవర్ కాకుండా ఇంకెవరు కూర్చున్న బస్సు ముందుకు కదలకుండా టెక్నాలజీ డెవలప్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు కూడా ఓ పద్దతిలో కూర్చోవాల్సి ఉంటుంది. ఈ మేరకు డ్రైవర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు.
రోజురోజుకు పోరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించటంతో పాటు పొల్యూషన్ ను కంట్రోల్ చేయటంలో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని SRTA చైర్మన్ యూసుఫ్ సలెహ్ అల్ సువైజి తెలిపారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?