షార్జా-అజ్మన్ మధ్య తొలి ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం
- December 19, 2019
పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పొల్యూషన్ కు విరుగుడుగా షార్జా రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు షార్జా-అజ్మన్ మధ్య తొలి ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ బుధవారం ప్రారంభించింది. తొలిగా ఆరు నెలల పాటు ఈ ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్సును ట్రయల్ చేసిన తర్వాత మరిన్ని సర్వీసులు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. చైనా షాంగన్ బస్ సంస్థకు చెందిన దుబాయ్ ఏజెంట్ రిలయన్స్ మోటర్స్ తో ఈ మేరకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రారంభమైన ఎలక్ట్రిక్ బస్సు షార్జాలోని అల్ జుబెల్ బస్టాండ్ నుంచి అజ్మన్ లోని అల్ ముసల్లా బస్ స్టేషన్ కు వెళ్తుంది. ఈ బస్సులో 27 మందికి సరిపడా సీటింగ్ కెపాసిటీ ఉంది. అలాగే 30 మంది వరకు నిల్చొవచ్చు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. ఆకుపచ్చని రంగులో ఉన్న ఈ బస్సులో బస్సు డ్రైవర్ సీటుకు ఓ ప్రత్యేక ఉంది. డ్రైవర్ కాకుండా ఇంకెవరు కూర్చున్న బస్సు ముందుకు కదలకుండా టెక్నాలజీ డెవలప్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు కూడా ఓ పద్దతిలో కూర్చోవాల్సి ఉంటుంది. ఈ మేరకు డ్రైవర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు.
రోజురోజుకు పోరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించటంతో పాటు పొల్యూషన్ ను కంట్రోల్ చేయటంలో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని SRTA చైర్మన్ యూసుఫ్ సలెహ్ అల్ సువైజి తెలిపారు.
తాజా వార్తలు
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!







