రోజంతా నాన్ స్టాప్ గా మెట్రో సర్వీసులు: న్యూఇయర్ షెడ్యూల్ ప్రకటించిన దుబాయ్ మెట్రో
- December 19, 2019
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయాణికుల కోసం మెట్రో సర్వీసు సమయాన్ని దుబాయ్ మెట్రో పొడగించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెడ్ లైన్, గ్రీన్ లైన్ రూట్లలో డిసెంబర్ 31, జనవరి 1న 24 గంటల పాటు మెట్రో ట్రైన్స్ నడుపుతున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఇక ఈ నెల 27న రషిదియా-DMCC స్టేషన్స్ మధ్య మెట్రో ట్రైన్లు ఉదయం 5 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. గ్రీన్ లైన్ కూడా సేమ్ టైమింగ్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక జనవరి 2న రెడ్ లైన్ రూట్లో ఉదయం 5 గంటల నుంచి ఫస్ట్ మెట్రో రైలు స్టార్ట్ అవుతంది. గ్రీన్ లైన్ రూట్లో మాత్రం 5.30 గంటల నుంచి ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజాము 3.30 గంటల వరకు సర్వీసు అందించనుంది. న్యూ ఇయర్ వేడుకల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లే వారు ఫ్లైట్ సమయానికి మూడు నాలుగు గంటల ముందే బయలుదేరాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!







