రోజంతా నాన్ స్టాప్ గా మెట్రో సర్వీసులు: న్యూఇయర్ షెడ్యూల్ ప్రకటించిన దుబాయ్ మెట్రో
- December 19, 2019
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయాణికుల కోసం మెట్రో సర్వీసు సమయాన్ని దుబాయ్ మెట్రో పొడగించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెడ్ లైన్, గ్రీన్ లైన్ రూట్లలో డిసెంబర్ 31, జనవరి 1న 24 గంటల పాటు మెట్రో ట్రైన్స్ నడుపుతున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఇక ఈ నెల 27న రషిదియా-DMCC స్టేషన్స్ మధ్య మెట్రో ట్రైన్లు ఉదయం 5 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. గ్రీన్ లైన్ కూడా సేమ్ టైమింగ్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక జనవరి 2న రెడ్ లైన్ రూట్లో ఉదయం 5 గంటల నుంచి ఫస్ట్ మెట్రో రైలు స్టార్ట్ అవుతంది. గ్రీన్ లైన్ రూట్లో మాత్రం 5.30 గంటల నుంచి ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజాము 3.30 గంటల వరకు సర్వీసు అందించనుంది. న్యూ ఇయర్ వేడుకల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లే వారు ఫ్లైట్ సమయానికి మూడు నాలుగు గంటల ముందే బయలుదేరాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!