బహ్రెయిన్:ముగిసిన ఐఎస్బి మెగా ఫెయిర్ 2019
- December 19, 2019
బహ్రెయిన్:ఇండియన్ స్కూల్ మెగా ఫెయిర్ 2019 ఘనంగా జరిగిన ముగింపు వేడుకలతో ముగిసింది. ఇసా టౌన్ కేంపస్లో ఈ వేడుకలు జరిగాయి. వేలాది మంది సందర్శకులు స్కూల్ క్యాంపస్లో సందడి చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, వేడుకల్ని తిలకించేందుకు సందర్శకులు రావడం గమనార్హం. ఇండియన్ మ్యుజీషియన్ స్టీఫెన్ దేవస్సీ మరియు బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ రితూ పాఠక్ సంద్శకుల్ని పెప్పీ సాంగ్స్తో ఆకట్టుకున్నారు. ఐఎస్బి ఛైర్మన్ ప్రిన్స్ ఎస్ నటరాజన్, ఇండియన్ స్కూల్ మెగా ఫెయిర్ సావనీర్ని విడుదల చేశారు. ఇండియన్ స్కూల్ విద్యార్థులు కళ్ళు చెదిరే రీతిలో వెస్టర్న్ మరియు అరబిక్ డాన్స్ని ప్రదర్శించడం జరిగింది. ఇండియన్ స్కూల్ టీచర్స్ రూపొందించిన ఫుడ్ స్టాల్స్ భోజన ప్రియుల్ని అలరించాయి. ఈ ఫెయిర్ ద్వారా జనరేట్ అయిన సొమ్ముని ఐఎస్బి స్టాఫ్ వెల్ఫేర్ కోసం వినియోగిస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!