బహ్రెయిన్:ముగిసిన ఐఎస్బి మెగా ఫెయిర్ 2019
- December 19, 2019
బహ్రెయిన్:ఇండియన్ స్కూల్ మెగా ఫెయిర్ 2019 ఘనంగా జరిగిన ముగింపు వేడుకలతో ముగిసింది. ఇసా టౌన్ కేంపస్లో ఈ వేడుకలు జరిగాయి. వేలాది మంది సందర్శకులు స్కూల్ క్యాంపస్లో సందడి చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, వేడుకల్ని తిలకించేందుకు సందర్శకులు రావడం గమనార్హం. ఇండియన్ మ్యుజీషియన్ స్టీఫెన్ దేవస్సీ మరియు బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ రితూ పాఠక్ సంద్శకుల్ని పెప్పీ సాంగ్స్తో ఆకట్టుకున్నారు. ఐఎస్బి ఛైర్మన్ ప్రిన్స్ ఎస్ నటరాజన్, ఇండియన్ స్కూల్ మెగా ఫెయిర్ సావనీర్ని విడుదల చేశారు. ఇండియన్ స్కూల్ విద్యార్థులు కళ్ళు చెదిరే రీతిలో వెస్టర్న్ మరియు అరబిక్ డాన్స్ని ప్రదర్శించడం జరిగింది. ఇండియన్ స్కూల్ టీచర్స్ రూపొందించిన ఫుడ్ స్టాల్స్ భోజన ప్రియుల్ని అలరించాయి. ఈ ఫెయిర్ ద్వారా జనరేట్ అయిన సొమ్ముని ఐఎస్బి స్టాఫ్ వెల్ఫేర్ కోసం వినియోగిస్తారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







