టీనేజ్ సిస్టర్స్పై అత్యాచారం: బహ్రెయినీ వ్యక్తికి జైలు శిక్ష
- December 21, 2019
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్ 30 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఇద్దరు టీనేజ్ సిస్టర్స్పై నిందితుడు అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. అందులో ఓ బాలిక వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. నిందితుడు, బాధితుల్ని బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేసినట్లు విచారణలో గుర్తించారు. బాధితుల్లో మరో బాలిక వయసు 18 సంవత్సరాలు. సోషల్ మీడియా ద్వారా 18 ఏళ్ళ యువతిని ట్రాప్ చేసి, ప్రేమిస్తున్నట్లు నటించి.. ఆమె ద్వారా ఆమె సోదరిని కూడా లొంగదీసుకున్నాడు నిందితుడు. తన ఇంట్లో ఇద్దరు బాలికలపైనా నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, బాధిత బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు వున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!