ఉమ్రా సీజన్‌లో 2.2 మిలియన్‌ వీసాల జారీ

- December 21, 2019 , by Maagulf
ఉమ్రా సీజన్‌లో 2.2 మిలియన్‌ వీసాల జారీ

సౌదీ అరేబియా: ఈ ఏడాది ఉమ్రా సీజన్‌ సందర్భంగా ఇప్పటికే 2.2 మిలియన్ల వీసాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 2,212,690 వీసాలు జారీ అయ్యాయి. ఇందులో 1,78554 యాత్రీకులు కింగ్‌డమ్‌కి చేరుకున్నారు. 1,373,93 మంది యాత్రీకులు ఉమ్రా తర్వాత దేశం విడిచి వెళ్ళారు. కాగా, 1,705,567 మంది యాత్రీకులు వాయు మార్గంలో వచ్చారు. భూ మార్గంలో 76,882 మంది, సముద్ర మార్గంలో 105 మంది ఉమ్రా యాత్రీకులు వచ్చినట్లు అధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం యాత్రీకుల్లో భారతీయుల సంఖ్య 238,981గా వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com