దుబాయ్లో 75 కిలోల డ్రగ్స్ స్వాధీనం
- December 24, 2019
75 కిలోల మెథాంఫెటమైన్ని కారు స్పేర్ పార్ట్స్లో దాచి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. జెబెల్ అలి పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ డాక్యుమెంట్స్ ప్రకారం నిందితులంతా ఆసియా జాతీయులేనని తేలింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా ఈ ఆటో స్పేర్ పార్ట్స్ని దుబాయ్కి తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుల్ని న్యాయస్థానం యెదుట హాజరుపరిచారు. యూఏఈ వెలుపల వున్న వ్యక్తికి చెందిన వస్తువులుగా స్పేర్ పార్ట్స్ గురించి ఓ నిందితుడు విచారణలో అంగీకరించాడు. కంటెయినర్ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి చెప్పిన మేరకు దాన్ని తాము అందుకునేందుకు వెళ్ళినట్లు నిందితులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







