జెడ్డా:సెలవుల సందర్భంగా హరమైన్ హైస్పీడ్ ట్రైన్ సర్వీసుల పెంపు

- December 31, 2019 , by Maagulf
జెడ్డా:సెలవుల సందర్భంగా హరమైన్ హైస్పీడ్ ట్రైన్ సర్వీసుల పెంపు

జెడ్డా:మిడ్ అకాడమిక్ ఇయర్ వెకేషన్ సందర్భంగా హరమైన్ హై స్పీడ్ ట్రైన్ సర్వీసులను పెంచనున్నట్లు ట్రైన్ ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. జనవరి 3 నుంచి 19 వరకు డైలీ 16 సర్వీసులు నడపనున్నారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్-KAIA, రబీగ్ లోని కింగ్ అబ్దుల్లా ఎకానామిక్ సిటీ మీదుగా మక్కా నుంచి మదీన వరకు ట్రైన్ సర్వీసులు నడపనున్నారు. గత సెప్టెంబర్ 29లో అగ్రిప్రమాదం చోటు చేసుకున్న తర్వాత దాదాపు రెండున్నర నెలలు మక్కా నుంచి మదీనా మధ్య సర్వీసులను నిలిపివేశారు. డిసెంబర్ 18 నుంచి మళ్లీ సర్వీసులను పునరుద్ధరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com