సౌదీ రిజిస్టర్డ్ స్పోర్ట్స్ కార్ స్మగ్లింగ్
- December 31, 2019
కువైట్ సిటీ: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్కి చెందిన ఇద్దరు అధికారులు, ఇద్దరు కువైటీలను స్మగ్లింగ్ కేసులో పోలీసులు సెక్యూరిటీ అథారిటీస్కి అప్పగించడం జరిగింది. నిందితులు, ఓ ఖరీదైన స్పోర్ట్స్ కార్ని దేశంలోకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. అల్ సాల్మి బోర్డర్ పాయింట్ ద్వారా నిందితులు సౌదీ రిజిస్టర్డ్ స్పోర్ట్స్ కారుని దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. నిందితులు కువైటీ నెంబర్ ప్లేట్స్ని వాహనానికి ముందూ వెనుకా అతికించారు. కారు ఓనరు నుంచి కారుని బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో, బోర్డర్ వద్దనున్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీల్ని పరిశీలించగా, ఈ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు కస్టమ్స్ అధికారులు, కారు నడుపుతున్న వ్యక్తి స్నేహితుడు ఈ స్మగ్లింగ్లో పాలుపంచుకున్నట్లు తేలడంతో వారిని అరెస్ట్ చేసి, సాల్మి పోలీస్ స్టేషన్కి వారిని రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!