పాకిస్తాన్ లో పర్యటనలో అబుధాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్

- January 02, 2020 , by Maagulf
పాకిస్తాన్ లో పర్యటనలో అబుధాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్

 

అబుదాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. తన ఒక రోజు పర్యటనలో భాగంగా అబుదాబి యువరాజు, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సమావేశం అవుతారు. ఈ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించనున్నట్లు పాకిస్తాన్ లోని యూఏఈ అంబాసిడర్ హమద్ ఒబైద్ ఇబ్రహీమి అల్ జాబీ తెలిపారు. యువరాజు గత ఏడాది జనవరిలో పాకిస్తాన్ పర్యటనకు వచ్చారు. మళ్లీ సరిగ్గా ఏడాది తర్వాత పాకిస్తాన్ లో పర్యటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com