ఒమన్లో రిక్రూట్మెంట్ ఏజెన్సీ మూసివేత
- January 02, 2020
మస్కట్: వినియోగదారులకు డొమెస్టిక్ సర్వీస్ అందిస్తోన్న ఓ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీని పలు ఫిర్యాదుల మేరకు అల్ దఖ్లియా గవర్నరేట్ మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వెల్లడించిన వివరాల ప్రకారం, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ - బహ్లా, ఈ ఏజెన్సీని మూసివేయాలని తీర్పునివ్వడం జరిగింది. అలాగే ఏజెన్సీకి 1,550 ఒమన్ రియాల్స్ జరీమానా కూడా విధించింది. కస్టమర్లను డూపింగ్ చేస్తున్నట్లు ఏజెన్సీపై ఫిర్యాదులు అందడమే దీనికి కారణం. వర్కర్స్ని తీసుకొస్తామని చెప్పి అడ్వాన్స్లు తీసుకుని, వాటిని డిపాజిట్లుగా మలచి, వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. కన్స్యుమర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు 900 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాలనీ, వినియోగదారులకు 1,550 ఒమన్ రియాల్స్ చెల్లించాలనీ న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!