శనివారాల్లో ఇకపై అందుబాటులో వుండని ముహరాక్ బ్రాంచ్ ఐడీ కార్డ్ సర్వీస్ సెంటర్
- January 03, 2020
మనామా: ఇన్ఫర్మేషన్ అండ్ ఇ గవర్నమెంట్ అథారిటీ (ఐజిఎ), ఇకపై ముహరాక్లోని సీఫ్ మాల్లోని తమ బ్రాంచ్, ఇకపై శనివారాల్లో అందుబాటులో వుండదని స్పష్టం చేసింది. ఆదివారం నుంచి గురువారం వరకు సాధారణంగానే ఇక్కడ సేవలు అందుతాయని ఐజిఎ పేర్కొంది. ఇప్పటిదాకా ఈ బ్రాంచ్లో శనివారం కూడా సేవలు అందుతున్నాయి. తదుపరి నోటీసు వచ్చేవరకు శనివారం సేవల్ని నిలుపుదల చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వివరించింది ఐజిఎ. 2019 సెకెండ్ హాఫ్లో శనివారాల్లోనే 11,000కి పైగా ఐడీ చిప్ అప్డేటింగ్ రిక్వెస్ట్లను ప్రాసెస్ చేసినట్లు ఐజిఎ డైరెక్టర్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ పాపులేషన్ రిజిస్ట్రీ షేక్ సబాహ్ బిన్ హమాద్ అల్ ఖలీఫా చెప్పారు. కాగా, జులై 13, 2019న ఐజిఎ, సీఫ్ మాల్ ముహారాక్, ఇసా టౌన్ ఐడీ సెంటర్స్ శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తుందని ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!