కువైట్ లో తెలుగు తమ్ముళ్ళ రక్తదానం

- January 17, 2016 , by Maagulf

తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ 20వ వర్ధంతి పురస్కరించుకొని రక్తదానం చేయాలని అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఇచ్చిన పిలుపు మేరకు గల్ఫ్ దేశాల్లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు స్వచ్ఛంధంగా రక్తదానం చేసారు.కువైట్‌లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ  ప్రెసిడెంట్ ములకల సుబ్బరాయుడు,జనరల్ సెక్రటరీ ఉదయ్ ప్రకాష్ నేతృత్వంలోని ప్రవాసాంధ్ర టీడీపీ శనివారం రక్తదానం కార్యక్రమం చేపట్టగా పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు జబరియా సెంట్రల్ బ్లడ్ బ్యాంకు, కువైట్ కి వెళ్ళి రక్తదానం చేసారు.సౌదీ అరేబియాలోని దమామ్ మరియు జుబేల్ పారిశ్రామిక ప్రాంతాలలోని కొన్ని కంపెనీల క్యాంపులలో కూడ ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ అభిమానులు రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com