చలికాలంలో అనారోగ్యాల బారినపడకుండా ఉండాలంటే...
- January 05, 2020చాలామంది చలికాలంలో అనారోగ్యాల బారినపడుతుంటారు. ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో పాటు మంచు, చలి, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో తీసుకునే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకుంటే అనారోగ్యంబారిన పడకుండా ఉండొచ్చు.
చలికాలంలో జలుబు, దగ్గు వంటివి సాధారణం. వాతావరణంలో మార్పులు, చల్లటి గాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండడమే అందుకు కారణం. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడకుండా రక్షణ పొందొచ్చు. అవేంటో ఓసారి చూద్ధాం.
అల్లం : తేనె కలిపిన అల్లం ముక్కలను లేదా అల్లం రసంగానీ రోజూ తీసుకున్నట్టయితే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణశక్తి సమస్యలు కూడా పరిష్కరమవుతాయి.
పసుపు : ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు... ఓ గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గిపోవడమే కాకుడా, రోగ నిరోధకశక్తి కూడా తగ్గిపోతాయి.
చిలగడదుంప : చలికాలంలో వీటిని క్రమంగా తీసుకున్నట్టయితే ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీటిలో అధికంగా పీచుపదార్థం, విటమిన్ ఏ, పొటాషియం వంటి అధికంగా ఉంటాయి.
నువ్వులు : శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో నువ్వులు బాగా పని చేస్తాయి. వారంలో మూడు రోజుల పాటు నూనెతో శరీరాన్ని బాగా మర్దన చేసుకుని స్నానం చేసినట్టయితే శరీరంలో వేడి పెరిగి, చలి నుంచి రక్షణ కల్పిస్తుంది.
ఎండు పండ్లు : జీడిపప్పు, వాల్ నట్స్, బాదం పప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు వంటివి పరిమితంగా తీసుకుంటే... శరీరానికి పోషకాలు, చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి చిట్కాలతో చలికాలంలో అనారోగ్యం బారినపడకుండా ఉండొచ్చు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం