ప్రధాని మోదీని కలిశాక మంచు లక్ష్మి చేసిన ట్వీట్
- January 06, 2020
న్యూఢిల్లీ: సినీ నటుడు మోహన్బాబు తన కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు మంచు విష్ణు, కోడలు విరోనికతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీతో ఆయన బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం జోరందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మోహన్బాబును బీజేపీలోకి ఆహ్వానించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. ప్రధానితో మోహన్బాబు దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపినట్లు తెలిసింది. మోదీతో భేటీ తర్వాత మంచు లక్ష్మి ఈ సమావేశానికి సంబంధించి ట్వీట్ చేసింది. ఇప్పుడే డైనమిక్ ప్రధాని మోదీని కలిశామని, మోదీ సారధ్యంలో భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మోహన్బాబు భేటీ కానున్నట్లు సమాచారం. సోమవారం నెలకొన్న ఈ తాజా పరిణామాలతో మంచు కుటుంబం వైసీపీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







