కువైట్ : చెత్తకుప్ప దగ్గర బంగారం సంచి..ఎవరు వదిలేశారు? ఎందుకు వదిలేశారు?
- January 06, 2020గార్బేజ్ కంటేనర్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి బంగారం సంచి వదిలివెళ్లిన ఘటన అబు అస్సానియా ప్రాంతంలో చోటు చేసుకుంది. అందులో వేల దినార్ ల విలువైన బంగారం నగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే..ఆ బ్యాగును ఎవరు వదిలేశారు? బంగారం యజమాని ఎవరు? ఎందుకు వదిలేశారో తెల్సుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముబారక్ అల్-కబిర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు చెత్త వేసే కంటేయినర్ దగ్గర గోల్డ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బ్యాగును ఎవరు వదిలివెళ్లారో తెల్సుకునేందుకు సమీపంలోని సీసీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే..ఇంట్లో పని చేసే వర్కర్స్ యజమాని ఇంట్లో చోరీ చేసి ఆ తర్వాత దొరికిపోతామనే భయంతో బంగారం బ్యాగును చెత్త కంటేనర్ దగ్గర పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. యజమానుల ఇళ్లలో చోరీలకు పాల్పడటం తరచుగా జరుగుతున్న ఘటనలను ఉదాహరణగా చెబుతున్నారు. బహుశా గ్యార్బేజ్ కంటేనర్ వాళ్ల ల్యాండ్ మార్క్ కూడా అయి ఉండొచ్చని..అక్కడ సంచిని వదిలివేసిన తర్వాత గ్యాంగ్ స్టర్స్ లేదా ట్యాక్సీ డ్రైవర్లు బ్యాగును తీసుకెళ్తుంటారని చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







