కువైట్ : చెత్తకుప్ప దగ్గర బంగారం సంచి..ఎవరు వదిలేశారు? ఎందుకు వదిలేశారు?
- January 06, 2020
గార్బేజ్ కంటేనర్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి బంగారం సంచి వదిలివెళ్లిన ఘటన అబు అస్సానియా ప్రాంతంలో చోటు చేసుకుంది. అందులో వేల దినార్ ల విలువైన బంగారం నగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే..ఆ బ్యాగును ఎవరు వదిలేశారు? బంగారం యజమాని ఎవరు? ఎందుకు వదిలేశారో తెల్సుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముబారక్ అల్-కబిర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు చెత్త వేసే కంటేయినర్ దగ్గర గోల్డ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బ్యాగును ఎవరు వదిలివెళ్లారో తెల్సుకునేందుకు సమీపంలోని సీసీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే..ఇంట్లో పని చేసే వర్కర్స్ యజమాని ఇంట్లో చోరీ చేసి ఆ తర్వాత దొరికిపోతామనే భయంతో బంగారం బ్యాగును చెత్త కంటేనర్ దగ్గర పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. యజమానుల ఇళ్లలో చోరీలకు పాల్పడటం తరచుగా జరుగుతున్న ఘటనలను ఉదాహరణగా చెబుతున్నారు. బహుశా గ్యార్బేజ్ కంటేనర్ వాళ్ల ల్యాండ్ మార్క్ కూడా అయి ఉండొచ్చని..అక్కడ సంచిని వదిలివేసిన తర్వాత గ్యాంగ్ స్టర్స్ లేదా ట్యాక్సీ డ్రైవర్లు బ్యాగును తీసుకెళ్తుంటారని చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?