కువైట్ : చెత్తకుప్ప దగ్గర బంగారం సంచి..ఎవరు వదిలేశారు? ఎందుకు వదిలేశారు?
- January 06, 2020గార్బేజ్ కంటేనర్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తి బంగారం సంచి వదిలివెళ్లిన ఘటన అబు అస్సానియా ప్రాంతంలో చోటు చేసుకుంది. అందులో వేల దినార్ ల విలువైన బంగారం నగలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే..ఆ బ్యాగును ఎవరు వదిలేశారు? బంగారం యజమాని ఎవరు? ఎందుకు వదిలేశారో తెల్సుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముబారక్ అల్-కబిర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు చెత్త వేసే కంటేయినర్ దగ్గర గోల్డ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బ్యాగును ఎవరు వదిలివెళ్లారో తెల్సుకునేందుకు సమీపంలోని సీసీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే..ఇంట్లో పని చేసే వర్కర్స్ యజమాని ఇంట్లో చోరీ చేసి ఆ తర్వాత దొరికిపోతామనే భయంతో బంగారం బ్యాగును చెత్త కంటేనర్ దగ్గర పడేసి ఉండొచ్చని భావిస్తున్నారు. యజమానుల ఇళ్లలో చోరీలకు పాల్పడటం తరచుగా జరుగుతున్న ఘటనలను ఉదాహరణగా చెబుతున్నారు. బహుశా గ్యార్బేజ్ కంటేనర్ వాళ్ల ల్యాండ్ మార్క్ కూడా అయి ఉండొచ్చని..అక్కడ సంచిని వదిలివేసిన తర్వాత గ్యాంగ్ స్టర్స్ లేదా ట్యాక్సీ డ్రైవర్లు బ్యాగును తీసుకెళ్తుంటారని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







