మతిస్థిమితం లేని తల్లికూతుళ్లపై అత్యాచారం..ఎసియన్ వ్యక్తికి లైఫ్ టైం ప్రిసన్
- January 06, 2020
రస్ అల్ ఖైమా: మతిస్థిమితం లేని తల్లికూతుళ్లపై పలుమార్లు అత్యాచారానికి తెగబడిన ఆసియా వ్యక్తికి రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. చీఫ్ జడ్జి జస్టిస్ సమే షకేర్ బెంచ్ నిందితుడు నేరానికి పాల్పడినట్లు నిర్ధారణకు రావటంతో ఈ మేరకు తీర్పునిచ్చింది. కోర్టు రికార్డుల ప్రకారం.. మతిస్థిమితం సరిగ్గా లేని మహిళ తీరులో మార్పును గమనించిన ఆమె బంధువులు ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు అనుమానించారు. గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్ చేయించటంతో వారి అనుమానమే నిజమైంది. పెళ్లి కాకుండా గర్భవతి అవటంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారించటంతో విషయం బయటపడింది. కొన్నాళ్లుగా మహిళను అబ్సర్వ్ చేస్తున్న నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె కూతుర్ని కూడా రేప్ చేశాడు. అయితే..నిందితుడు తమపై అత్యాచారం జరుపుతున్న విషయాన్ని కూడా గ్రహించలేని మానసిక స్థితి వాళ్లిద్దరిది. దీంతో పదే పదే అతను దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నిందితుడిపై అభియోగం నిర్ధారణ కావటంతో రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







