మతిస్థిమితం లేని తల్లికూతుళ్లపై అత్యాచారం..ఎసియన్ వ్యక్తికి లైఫ్ టైం ప్రిసన్
- January 06, 2020
రస్ అల్ ఖైమా: మతిస్థిమితం లేని తల్లికూతుళ్లపై పలుమార్లు అత్యాచారానికి తెగబడిన ఆసియా వ్యక్తికి రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. చీఫ్ జడ్జి జస్టిస్ సమే షకేర్ బెంచ్ నిందితుడు నేరానికి పాల్పడినట్లు నిర్ధారణకు రావటంతో ఈ మేరకు తీర్పునిచ్చింది. కోర్టు రికార్డుల ప్రకారం.. మతిస్థిమితం సరిగ్గా లేని మహిళ తీరులో మార్పును గమనించిన ఆమె బంధువులు ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు అనుమానించారు. గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి టెస్ట్ చేయించటంతో వారి అనుమానమే నిజమైంది. పెళ్లి కాకుండా గర్భవతి అవటంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారించటంతో విషయం బయటపడింది. కొన్నాళ్లుగా మహిళను అబ్సర్వ్ చేస్తున్న నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె కూతుర్ని కూడా రేప్ చేశాడు. అయితే..నిందితుడు తమపై అత్యాచారం జరుపుతున్న విషయాన్ని కూడా గ్రహించలేని మానసిక స్థితి వాళ్లిద్దరిది. దీంతో పదే పదే అతను దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నిందితుడిపై అభియోగం నిర్ధారణ కావటంతో రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







