ఉక్రెయిన్ లో విమాన ప్రమాదం..170 మందికి పైగా ప్రయాణికుల మృతి
- January 08, 2020
ఉక్రెయిన్ ప్రయాణికుల విమానం ఇరాన్లో కూలిపోయింది. ఈ విమానంలో 170 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. విమానంలో ఉన్నవారు సజీవంగా ఉండే అవకాశమే లేదని ఇరాన్కు చెందిన రెడ్ క్రిసెంట్ ప్రకటించింది.
రాయిటర్స్ వార్తల ప్రకారం ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఇమామ్ ఖామెనెయీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాగానే ప్రమాదానికి గురైంది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ విమానం ప్రమాదానికి గురైందని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ చెప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విమానం ఉక్రెయిన్ రాజధాని కీవ్ వెళ్తోంది.
విమానాశ్రయం దగ్గర ఘటనాస్థలం దగ్గరకు సహాయ సిబ్బందిని పంపించారు. "విమానం మంటల్లో ఉంది. కానీ మేం సిబ్బందిని పంపించాం. కొంతమందినైనా కాపాడగలమని అనుకుంటున్నాం" అని ఇరాన్ అత్యవసర సేవల అధికారి పిర్హొస్సేన్ కౌలీవాండ్ రాయిటర్స్తో అన్నట్లు ఇరాన్ టీవీ చెప్పింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







