కువైట్:మంత్రి సూచనల మేరకు స్పందించిన కువైట్ జాగృతి

- January 08, 2020 , by Maagulf
కువైట్:మంత్రి సూచనల మేరకు స్పందించిన కువైట్ జాగృతి

కువైట్: తెలంగాణ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు వెంటనే స్పందించిన కువైట్ జాగృతి టీం సభ్యులు.వినయ్ ముత్యాల ఆధ్వర్యంలో బాధితుడు మానేటి మనోజ్ దగ్గరకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకుని ఇండియన్ ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.అవసరమైన పూర్తి సహాయ సహకారాలను జాగృతి తరపు నుంచి ఇండియాకి పంపిస్తామని బాధితుడికి పూర్తి భరోసా ఇచ్చారు.అదే విధంగా గల్ఫ్ కు రావాలనుకునే యువత సరైన నైపుణ్యత శిక్షణ తీసుకుని లీగల్ ఏజెంట్ల ద్వారా  రాగలరని కోరారు.ఈ కార్యక్రమంలో  జాగృతి నాయకులు ప్రమోద్ కుమార్, సైఫుద్దీన్, వారం రాజశేఖర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com