సిటీ సెంటర్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం
- January 09, 2020బహ్రెయిన్: సీఫ్లోని సిటీ సెంటర్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా విజిటర్స్ ఆందోళనకు గురయ్యారు. సివిల్ డిఫెన్స్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ముందుగా విజిటర్స్ని ఖాళీ చేయించిన అధికారులు, ఆ తర్వాత మంటల్ని అదుపు చేశారు. కాగా, ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మినిస్టర్ జాయెద్ అల్ జయానీ, ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఓ రెస్టారెంట్ చిమ్నీ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని కేవలం 55 నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మాల్ యాజమాన్యం తీసుకున్న చర్యలు అమోఘమనీ, తిరిగి మాల్లో కార్యకలాపాలు యధాతథంగా కొనసాగుతున్నాయని మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ