కొత్త వీసా పాలసీలతో పెరుగుతున్న పర్యాటకులు
- January 09, 2020
రియాద్: వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని వివిధ దేశాలకు విస్తరించడం ద్వారా టూరిజం సెక్టార్ సౌదీ అరేబియాలో గణనీయంగా అభివృద్ధి చెందుతోందని బిజినెస్ ఇన్సైడర్స్ వెల్లడిస్తోంది. స్థానిక టూర్ ఆపరేటర్ ఘాజి అల్ ఒనైజి మాట్లాడుతూ టూరిస్ట్ వీసాల్లో మార్పుల నేపథ్యంలో టూరిస్టుల సంఖ్య 200 శాతం పెరిగిందని చెప్పారు. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టూరిజం సెక్టార్లో వృద్ధి 300 శాతం వరకు వుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. 45 దేశాలకు చెందిన టూరిస్టులతో తాను మాట్లాడాననీ, వారంతా ఇంకోసారి సౌదీలో పర్యటించాలనే ఆసక్తిని వెలిబుచ్చారని చెప్పారాయన. సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ వెల్లడించిన వివరాల ప్రకారం 90 రోజుల పాటు కింగ్డమ్లో టూరిస్టులు స్టే చేయొచ్చనీ, ఈ పీరియడ్లో వారు మల్టిపుల్ టైమ్స్ కింగ్డమ్లోకి ఎంటర్ అవ్వొచ్చని తెలిపింది. మొత్తం 49 దేశాలకు చెందిన టూరిస్టులు ఇ-వీసా ఆన్లైన్ విధానం ద్వారా వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







