అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి చికిత్స నిమిత్తం దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి

- January 10, 2020 , by Maagulf
అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి చికిత్స నిమిత్తం దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి

యూ.ఏ.ఈ:39 ఏళ్ళ ఆసియా వ్యక్తి ఒకరు 7,500 దిర్హామ్‌లను కంపెనీ కారు నుంచి దొంగిలిస్తూ దొరికిపోయాడు. విచారణ సందర్భంగా నిందితుడు, ఆ డబ్బును తాను దొంగిలించింది అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి వైద్య చికిత్స చేసేందుకోసమేనని చెప్పాడు. నిందితుడికి న్యాయస్థానం 3 నెలల జైలు శిక్ష మాత్రమే విధించింది. దొంగిలించిన సొమ్ముల్లోంచి 1,000 దిర్హామ్‌లను తన తల్లికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఖర్చు చేశాడనీ, అంతే మొత్తంలో సొమ్ముని తన కుటుంబానికి పంపించాడనీ, మిగిలిన మొత్తాన్ని ఎడారి ప్రాంతంలో పాతిపెట్టాడని అధికారులు వివరించారు. స్పైసెస్‌ని ప్యాకేజ్‌ చేసే సంస్థకు చెందిన కారులో డబ్బు వుంచగా, డ్రైవర్‌ కారు దిగి వెళ్ళగానే నిందితుడు ఆ డబ్బుని కాజేశాడు. సిసిటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com