అరామ్ కో షేర్లకు అదరిపోయే డిమాండ్ : మార్కెట్లోకి మరో 450 మిలియన్ల షేర్లు
- January 14, 2020సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ ఆరామ్కో షేర్లకు రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతోంది. ఐపీఓకి వచ్చిన రోజే ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సంచలనం సృష్టించిన అరామ్ కో షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ ఉండటంతో అదనంగా 450 మిలియన్ల షేర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత డిసెంబర్ 11న సౌదీ స్టాక్ మార్కెట్ తడవుల్ లిస్టింగ్ కి వచ్చిన అరామ్ కో తమ కంపెనీ షేర్లలో 1.5 శాతం వాటా షేర్లను ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్-IPO ద్వారా విక్రయించి 2,560 కోట్ల డాలర్లు (రూ.1.8 లక్షల కోట్లు) సమీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ అవతరించింది. కంపెనీ షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి ఫుల్ డిమాండ్ ఉండటంతో గ్రీన్ షూ అప్షన్ ద్వారా మరో 450 మిలియన్ల అదనపు షేర్లను ఐఫీఓకి తీసుకొచ్చే వెసులుబాటు కలిగింది. అయితే..ఈ అదనపు షేర్లను బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా ఇన్వెస్టర్లకు అలాట్ చేసింది. దీంతో అదనపు షేర్లను విక్రయించినా మార్కెట్లోకి కొత్త షేర్లు రిలీజ్ చేయలేదని అరామ్ కో కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదిలాఉంటే అరామ్ కో షేర్ ప్రైజ్ ప్రస్తుతం 35 రియల్స్ కు చేరుకోవటంతో కంపెనీ విలువకు 1.87 ట్రిలియన్లు యాడ్ అయ్యాయి. దీంతోమార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా ప్రపంచ నెంబర్–1 కంపెనీగా సౌదీ ఆరామ్కో అవతరించింది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం