కువైట్ సిటీ: మద్యంమత్తులో యాక్సిడెంట్ చేసిన కువైట్ దంపతుల అరెస్ట్
- January 16, 2020
మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ సిమెంట్ బారియర్ ను ఢికొట్టిన భార్యభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కారును చేజ్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో కారను వేగంగా డ్రైవ్ చేయటం వల్లే యాక్సిడెంట్ జరిగినట్లు అధికారులు. ప్రమాద గురించి ఇంటిరియర్ మినిస్ట్రి ఆపరేషన్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ అందగానే పోలీసులు, పారామెడిక్స్ స్పాట్ చేరుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..ప్రమాదంపై వారిని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులు తమను చేజ్ చేసేందుకు ప్రయత్నించడంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరిగిందని దంపతులు తెలిపారు. దీనిపై ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే..తమను ఉద్దేశించి అశ్లీలంగా హ్యాండ్ గెస్టర్స్ చేశారని అందుకే తాము వెంబడించాల్సి వచ్చిందని ఆ ఇద్దరు వ్యక్తులు వివరించారు. దీంతో పోలీసులు భార్య భర్తలిద్దర్ని అరెస్ట్ చేసి తదుపరి లీగల్ యాక్షన్ కు పంపించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







