కువైట్ సిటీ: మద్యంమత్తులో యాక్సిడెంట్ చేసిన కువైట్ దంపతుల అరెస్ట్
- January 16, 2020మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ సిమెంట్ బారియర్ ను ఢికొట్టిన భార్యభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కారును చేజ్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో కారను వేగంగా డ్రైవ్ చేయటం వల్లే యాక్సిడెంట్ జరిగినట్లు అధికారులు. ప్రమాద గురించి ఇంటిరియర్ మినిస్ట్రి ఆపరేషన్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ అందగానే పోలీసులు, పారామెడిక్స్ స్పాట్ చేరుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..ప్రమాదంపై వారిని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులు తమను చేజ్ చేసేందుకు ప్రయత్నించడంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరిగిందని దంపతులు తెలిపారు. దీనిపై ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే..తమను ఉద్దేశించి అశ్లీలంగా హ్యాండ్ గెస్టర్స్ చేశారని అందుకే తాము వెంబడించాల్సి వచ్చిందని ఆ ఇద్దరు వ్యక్తులు వివరించారు. దీంతో పోలీసులు భార్య భర్తలిద్దర్ని అరెస్ట్ చేసి తదుపరి లీగల్ యాక్షన్ కు పంపించారు.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం