కువైట్ సిటీ: మద్యంమత్తులో యాక్సిడెంట్ చేసిన కువైట్ దంపతుల అరెస్ట్
- January 16, 2020
మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ సిమెంట్ బారియర్ ను ఢికొట్టిన భార్యభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కారును చేజ్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో కారను వేగంగా డ్రైవ్ చేయటం వల్లే యాక్సిడెంట్ జరిగినట్లు అధికారులు. ప్రమాద గురించి ఇంటిరియర్ మినిస్ట్రి ఆపరేషన్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ అందగానే పోలీసులు, పారామెడిక్స్ స్పాట్ చేరుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..ప్రమాదంపై వారిని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులు తమను చేజ్ చేసేందుకు ప్రయత్నించడంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరిగిందని దంపతులు తెలిపారు. దీనిపై ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే..తమను ఉద్దేశించి అశ్లీలంగా హ్యాండ్ గెస్టర్స్ చేశారని అందుకే తాము వెంబడించాల్సి వచ్చిందని ఆ ఇద్దరు వ్యక్తులు వివరించారు. దీంతో పోలీసులు భార్య భర్తలిద్దర్ని అరెస్ట్ చేసి తదుపరి లీగల్ యాక్షన్ కు పంపించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









