ఎన్టీఆర్కు నందమూరి కుటుంబసభ్యుల నివాళులు
- January 18, 2020హైదరాబాద్:టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 24వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులు ఆయనకు నివాళులర్పించారు. శనివారం ఉదయం నెక్లెస్రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్, పురందేశ్వరి, సుహాసిని, రామకృష్ణ తదితరులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ చుట్టూ ప్రదక్షణ చేసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, సుహాసిని మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడన్నారు. ఎన్టీఆర్ ఆశయసాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఆడపడుచుల కోసం ఎన్టీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పారు. తెలుగుజాతి కీర్తిప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్దే అని రామకృష్ణ, సుహాసిని అన్నారు.
మరోవైపు పెద్దసంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలు కూడా భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో ఆయన అభిమానులు, రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?