డ్యూటీ ఫ్రీ కోటా - ఇండియన్‌ బౌన్డ్‌ ప్రయాణీకులకు చేదు వార్త

- January 20, 2020 , by Maagulf
డ్యూటీ ఫ్రీ కోటా - ఇండియన్‌ బౌన్డ్‌ ప్రయాణీకులకు చేదు వార్త

న్యూ ఢిల్లీ: ఇండియా బౌన్డ్‌ ప్యాసింజర్స్‌కి డ్యూటీ ఫ్రీ కొనుగోళ్ళు ఇకపై భారమయ్యే అవకాశాలున్నాయి. ఇండియన్‌ కామర్స్‌ మినిస్ట్రీ 50 శాతం కోతని ఆల్కహాల్‌ కొనుగోళ్ళపై విధించే అవకాశముంది. అలాగే పూర్తిగా సిగరెట్‌ కార్టన్స్‌ నిషేధంలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం వున్న 2 లీటర్ల కోటా నుంచి సగాన్ని.. అంటే ఒక లీటర్‌ని కట్‌ చేసేలా ్పతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్యూటీ ఫ్రీ షాప్స్‌ ద్వారా కొనుగోలు చేసే సిగరెట్‌ కార్టన్స్‌పై నిషేధం విధించనున్నట్లు సమాచారం. కాగా, కామర్స్‌ మినిస్ట్రీ పేపర్‌, ఫుట్‌వేర్‌, రబ్బర్‌ మరియు బొమ్మలు వంటివాటిపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచడం ద్వారా మేక్‌ ఇన్‌ ఇండియాని మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com