శ్రమ మినహా జమ ఎరగని ప్రవాశీయులు దుబాయ్ లో సర్వే వెల్లడి

- January 18, 2016 , by Maagulf
శ్రమ మినహా జమ ఎరగని ప్రవాశీయులు దుబాయ్ లో సర్వే  వెల్లడి

  యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో  జీవన వ్యయం విపరీతంగా పెరగడంతో ఇతర దేశాల ఉద్యోగులు ,   శ్రామికులు కొంత డబ్బును దాచుకునే పరిస్థితులు నానాటికీ తగ్గిపోతున్నాయి. దీంతో వీరు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఒక కొత్త సర్వే సూచిస్తుంది. దుబాయి లో నివసిస్తున్న 2,200  ప్రవాశీయుల పై  జరిగిన సర్వే లో  30 శాతం మంది  కనీసం ఒక్క దినార్ అయినా , ఇక్కడ ఉండి   దాచుకోలేకపోతున్నారు. మరో 53 శాతం మంది తమకు వచ్చే ఆదాయంలో దాచుకునేందుకు ఏమీ  మిగలని పరిస్థితులు వారికి ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి జనవరి మాసం వరుకు జరిగిన ఈ సర్వే లో పై విషయాలు వెలుగు లోనికి వచ్చాయి. వీరికి వచ్చే ఆదాయం కుటుంబం, జీవన ఖర్ఛులు   మాత్రమె కాక, అత్యధిక ప్రవాశీయులలో ఆర్ధిక క్రమశిక్షణ కొరవడిందని, దీంతో పొదుపు చేసే లక్షణం  చాల వరుకు తగ్గిపోతున్నాయి. దుబాయ్ లో  ఉన్న ద్రవ్యోల్బణం కారణంగా గృహోపకరణాల ఖర్చు ,గృహావసారాలు, గృహోపకరణాలు , రోజువారీ ఇంటి ఖర్చుల నిర్వహణ నానాటికీ భారమవుతుంది.ఇక వసతి, నీరు, విద్యుత్ , గ్యాస్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. పలువురు ప్రవాశీయులు దుబాయ్ లో కొంత సంపాదించాలనే లక్ష్యంతో వస్తున్నారని , కాని ఇక్కడ అధిక జీవనవ్యయం కారణంగా ఎందరో నిరాశా చెందుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com