దుబాయ్‌ కి చెందిన 8 మంది భారతీయులు నేపాల్లో మృతి

- January 21, 2020 , by Maagulf
దుబాయ్‌ కి చెందిన 8 మంది భారతీయులు నేపాల్లో మృతి

నేపాల్:ఎనమిది మంది భారత టూరిస్టులు నేపాల్‌లోని ఓ హోటల్‌లో మృతి చెందారు. ఈరోజు ఉదయం నేపాల్‌లోని దామన్‌లో ఉన్న హోటల్‌లో ఈ ఘటన జరిగింది. హోటల్‌ గదిలో హీటర్ గాలికి ఆక్సీజన్ అందకపోవడంతో.. ఊపిరాడక మృతి చెందారు. వీరంతా కేరళకు చెందినవారు. నివేదికల ప్రకారం.. కేరళలోని తిరువనంతపురం నుండి 15 మంది బృందం నేపాల్ వెళ్లింది. నేపాల్ మక్వాన్పూర్ జిల్లా డామన్ లోని ఒక హోటల్ లో నాలుగు గదులను బుక్ చేసుకున్నారు. వారిలో ఎనిమిది మంది ఒక గదిలో ఉండగా, మిగిలినవారు మరొక గదిలో ఉన్నారని రిసార్ట్ మేనేజర్ చెప్పారు. హోటల్‌ గదిలో హీటర్ గాలికి ఆక్సీజన్ అందకపోవడంతో.. ఊపిరాడక మృతి చెందారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి దాదాపు 2500 మీటర్ల ఎత్తులో ఉంది.దుబాయ్‌లో నివసిస్తున్న తిరువనంతపురానికి చెందిన ప్రవీణ్ కృష్ణన్ నాయర్ (39), అతని భార్య శరణ్య (34) వారి ముగ్గురు పిల్లలతో పాటు శ్రీభద్ర (9), ఆర్చా (8), అభి నాయర్ (7) మరణించారు. కోజికోడ్‌కు చెందిన ప్రవీణ్ స్నేహితుడు రెంజిత్ కుమార్ టిబి (39), అతని భార్య ఇందూ రెంజిత్ (34), వారి కుమారుడు వైష్ణవ్ రెంజిత్ (2) కూడా ఒకే గదిలో నిద్రిస్తున్నారని మక్వాన్‌పూర్ జిల్లా పోలీసు కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ ముగ్గురూ కూడా మరణించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారి కుమారుడు మాధవ్ వేరే గదిలో నిద్రించగా. అతను ప్రాణాలు దక్కించుకున్నాడు.నేపాల్ నుంచి ఇండియాకు మృతదేహాల్ని తీసుకురావటానికి  తగిన చర్యలు తీసుకుంటున్నామని విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com