ఇరాక్ అమెరికన్ ఎంబసీపై రాకెట్ దాడి

- January 22, 2020 , by Maagulf
ఇరాక్ అమెరికన్ ఎంబసీపై రాకెట్ దాడి

ఇరాక్:ప్రతీకారేచ్ఛ తో ఉన్న ఇరాన్ మరోసారి పంజా విప్పింది.ఇరాన్‌ సైనిక కమాండర్‌ సులేమాని హత్యకు నిరసనగా అగ్రరాజ్యం అమెరికా తో పోరుకు కాలు దువ్వుతుంది.ఇరాక్ రాజధాని బాగ్దాద్ నడిబొడ్డున, హై సెక్యూరిటీ గ్రీన్ జోన్ లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయంపై మరోసారి రాకెట్ దాడులకు పాల్పడింది.

వాటి సమీపంలో మూడు రాకెట్లు పడ్డాయని, ఆస్తినష్టం తప్ప, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా ఇంకా స్పందించలేదు. ఇరాన్ ప్రయోగించిన ఈ రాకెట్లు లక్ష్యాన్ని చేరుకోలేదని తప్పాయని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com