టీడీపీ నేతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు

- January 23, 2020 , by Maagulf
టీడీపీ నేతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు

అమరావతి: రాజధాని ఉద్యమంలో టీడీపీ నేతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇవాళ ఉదయం పార్టీ నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.
మంత్రులు చేసిందేమిటి? : ‘రింగుదాటి వస్తే బయటపడేయండని మార్షల్స్‌ను జగన్‌ ఆదేశించారు.. మండలిలో వైసీపీ మంత్రులు చేసిందేమిటి?. పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను వైసీపీ ఎమ్మెల్సీలను ఏం చేయాలి..?. మండలిలో 25మంది మంత్రులు తిష్టవేసి వీరంగం చేశారు. ఎంపీ గల్లా జయదేవ్‌ను శారీరకంగా, మానసికంగా హింసించారు. ఇక అమరావతి పరిరక్షణ ప్రజల చేతుల్లోనే ఉంది. జేఏసీ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి’ అని టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు పిలుపునిచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com