టీడీపీ నేతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు
- January 23, 2020
అమరావతి: రాజధాని ఉద్యమంలో టీడీపీ నేతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇవాళ ఉదయం పార్టీ నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.
మంత్రులు చేసిందేమిటి? : ‘రింగుదాటి వస్తే బయటపడేయండని మార్షల్స్ను జగన్ ఆదేశించారు.. మండలిలో వైసీపీ మంత్రులు చేసిందేమిటి?. పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను వైసీపీ ఎమ్మెల్సీలను ఏం చేయాలి..?. మండలిలో 25మంది మంత్రులు తిష్టవేసి వీరంగం చేశారు. ఎంపీ గల్లా జయదేవ్ను శారీరకంగా, మానసికంగా హింసించారు. ఇక అమరావతి పరిరక్షణ ప్రజల చేతుల్లోనే ఉంది. జేఏసీ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి’ అని టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







