టీడీపీ నేతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు
- January 23, 2020
అమరావతి: రాజధాని ఉద్యమంలో టీడీపీ నేతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇవాళ ఉదయం పార్టీ నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.
మంత్రులు చేసిందేమిటి? : ‘రింగుదాటి వస్తే బయటపడేయండని మార్షల్స్ను జగన్ ఆదేశించారు.. మండలిలో వైసీపీ మంత్రులు చేసిందేమిటి?. పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను వైసీపీ ఎమ్మెల్సీలను ఏం చేయాలి..?. మండలిలో 25మంది మంత్రులు తిష్టవేసి వీరంగం చేశారు. ఎంపీ గల్లా జయదేవ్ను శారీరకంగా, మానసికంగా హింసించారు. ఇక అమరావతి పరిరక్షణ ప్రజల చేతుల్లోనే ఉంది. జేఏసీ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి’ అని టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







