దుబాయ్ కాప్పై దాడి: ఇద్దరు మహిళలకు జైలు
- January 24, 2020దుబాయ్:మద్యం సేవించి, ఆ మత్తులో దుబాయ్ కాప్పై దాడి చేసిన ఇద్దరు మహిళలకు ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితులిద్దరూ కెనడియన్ వలసదారులుగా గుర్తించారు. వీరిలో ఒకరు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తోంటే, మరొకరు డిజైన్ మేనేజర్. గత ఏడాది జులై 19న ఈ ఫఘటన జరిగింది. పెట్రోలింగ్ డ్యూటీలో వున్న పోలీస్ అధికారిపై నిందితులు దాడి చేశారు. మద్యం మత్తులో వున్న మహిళలు తన కారు ఎక్కారనీ, వారు కోరుకున్న చోట డ్రాప్ చేయగా, తగిన ఫేర్ చెల్లించేందుకు వారు సుముఖత వ్యక్తం చేయకపోగా, తనపై దాడికి యత్నించారని ఓ క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది పరిస్థితిని ఆరా తీసే క్రమంలో, ఇద్దరు నిందితులు ఆ పోలీస్ అధికారిపై దాడికి దిగారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్