దుబాయ్ కాప్పై దాడి: ఇద్దరు మహిళలకు జైలు
- January 24, 2020
దుబాయ్:మద్యం సేవించి, ఆ మత్తులో దుబాయ్ కాప్పై దాడి చేసిన ఇద్దరు మహిళలకు ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితులిద్దరూ కెనడియన్ వలసదారులుగా గుర్తించారు. వీరిలో ఒకరు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తోంటే, మరొకరు డిజైన్ మేనేజర్. గత ఏడాది జులై 19న ఈ ఫఘటన జరిగింది. పెట్రోలింగ్ డ్యూటీలో వున్న పోలీస్ అధికారిపై నిందితులు దాడి చేశారు. మద్యం మత్తులో వున్న మహిళలు తన కారు ఎక్కారనీ, వారు కోరుకున్న చోట డ్రాప్ చేయగా, తగిన ఫేర్ చెల్లించేందుకు వారు సుముఖత వ్యక్తం చేయకపోగా, తనపై దాడికి యత్నించారని ఓ క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది పరిస్థితిని ఆరా తీసే క్రమంలో, ఇద్దరు నిందితులు ఆ పోలీస్ అధికారిపై దాడికి దిగారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







