దుబాయ్ కాప్పై దాడి: ఇద్దరు మహిళలకు జైలు
- January 24, 2020
దుబాయ్:మద్యం సేవించి, ఆ మత్తులో దుబాయ్ కాప్పై దాడి చేసిన ఇద్దరు మహిళలకు ఆరు నెలల చొప్పున జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితులిద్దరూ కెనడియన్ వలసదారులుగా గుర్తించారు. వీరిలో ఒకరు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తోంటే, మరొకరు డిజైన్ మేనేజర్. గత ఏడాది జులై 19న ఈ ఫఘటన జరిగింది. పెట్రోలింగ్ డ్యూటీలో వున్న పోలీస్ అధికారిపై నిందితులు దాడి చేశారు. మద్యం మత్తులో వున్న మహిళలు తన కారు ఎక్కారనీ, వారు కోరుకున్న చోట డ్రాప్ చేయగా, తగిన ఫేర్ చెల్లించేందుకు వారు సుముఖత వ్యక్తం చేయకపోగా, తనపై దాడికి యత్నించారని ఓ క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది పరిస్థితిని ఆరా తీసే క్రమంలో, ఇద్దరు నిందితులు ఆ పోలీస్ అధికారిపై దాడికి దిగారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







