మీ పిల్లల చివరి చూపునకు రండి: నిర్భయ దోషుల కుటుంబీకులకు సమాచారం పంపిన జైలు అధికారులు
- January 24, 2020నిర్భయ కేసులో దోషులకు రోజులు దగ్గర పడుతున్నాయి. రివ్యూ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఫలితాన్ని ఇవ్వని తరుణంతో.. ఫిబ్రవరి 1న వారి ఉరితీతకు ముహూర్తం ఖరారైంది. తిహార్ జైలులో వారి ఉరితీతకు.. ఇప్పటికే ఇసుక బస్తాలతో రిహార్సల్స్ కూడా పూర్తయ్యాయి.
ఇలా ఉరితీత ఖాయమైన నేపథ్యంలో దోషుల కుటుంబీకులకు జైలు అధికారులు సమాచారం పంపారు. 'మీ పిల్లలకు ఫిబ్రవరి 1 చివరి రోజు. ఆ రోజు ఉరి తీస్తున్నాం. చివరి చూపునకు రండి' అని ఆనవాయితీ ప్రకారం పిలుపు పంపారు. అంతకు ముందు.. దోషుల చివరి కోరికను అడిగితే.. ఎవరూ సమాధానం చెప్పకుండా.. మౌనంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో.. నిర్భయ కేసు దోషుల కుటుంబీకులు వారి పిల్లలను చూసుకునేందుకు జైలుకు వెళ్తారా? అసలు వారి ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు జైలులో ఉన్న ఆ నలుగురి మానసిక పరిస్థితి ఎలా ఉంది? అన్నది.. అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఈ భావోద్వేగాల సంగతి ఎలా ఉన్నా.. ఆ నలుగురు దోషుల ఉరి తీత మాత్రం ఖాయం. ఈ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కారాగారంలో దోషులు ఎలా ఉన్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అన్నది నిరంతరం కనిపెడుతూ ఉన్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు