సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాతే ఇరాన్‌తో సంబంధాలు పునరుద్ధరణ:సౌదీ మంత్రి

- January 24, 2020 , by Maagulf
సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాతే ఇరాన్‌తో సంబంధాలు పునరుద్ధరణ:సౌదీ మంత్రి

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తలు చల్లబడాలంటే ఇరాన్‌లో పరిస్థితులు సాధారణ స్థాయికి రావాలని సౌదీ విదేశాంగ శాఖ మంత్రి అదెల్‌ అల్‌ జుబైర్‌ అన్నారు. నార్మల్‌ స్టేట్‌కి వచ్చిన తర్వాతే మళ్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ కొనసాగించేందుకు పాజిబుల్ ఉంటుందన్నారు. అంతకుముందు మిడిల్‌ ఈస్ట్‌ లో  గల్ఫ్ కంట్రీస్‌ సంబంధాలపై ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి మొహమ్మద్ జావెద్‌ జరీఫ్‌ మాట్లాడుతూ ఇరుగుపొరుగు గల్ఫ్‌ దేశాలతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అలాగే స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు ఏ కార్యక్రమం చేపట్టినా పాల్గొనేందుకు తాము రెడీగా ఉన్నామని అన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన సౌదీ విదేశాంగ శాఖ..ఇరాన్ లో ఉద్రిక్తతలు చల్లారిన తర్వాతే ఆ దేశంలో రిలేషన్స్‌ పునరుద్ధరణ జరుగుతుందని అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com