సీఎం జగన్ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు:సుమన్
- January 25, 2020
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంత రైతులు వారికి ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ విషయంలో సినీ పరిశ్రమను కోరితే ‘మా’మూవీ అసోసియేషన్ తరఫున తప్పకుండా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మాచర్లలో సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాజధాని అమరావతిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. మూడు రాజధానుల విషయంలో సీఎం అసలు ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ను కలవడానికి ఐదుసార్లు ప్రయత్నించానని, అయితే తనకు అపాయింట్మెంట్ దొరకలేదని తెలిపారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!