పద్మ అవార్డ్స్ 2020 : పీవీ సింధుకు పద్మభూషణ్..
- January 25, 2020
కేంద్ర ప్రభుత్వం 2020 ఏడాదికిగానూ పద్మ అవార్డులను ప్రకటించింది. క్రీడారంగంలో ప్రతిభ చూపినందుకు స్టార్ షట్లర్ పీవీ సింధును పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. సింధు సహా మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు వచ్చాయి. తెలంగాణ నుంచి చింతల వెంకట్ రెడ్డి, శ్రీభాశ్యం విజయసారథి.. ఆంధ్రప్రదేశ్ నుంచి యడ్ల గోపాలరావు, దలవాయి చలపాతి రావు పద్మ శ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.
మొత్తంగా 141 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
ఏడుగురిని పద్మ విభూషణ్, పదహారు మందిని పద్మ భూషణ్ అవార్డులకు ఎంపిక చేసింది.
కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, జార్జ్ ఫెర్నాండేజ్, సుష్మస్వరాజ్లతోపాటు కర్ణాటకకు చెందిన విశ్వేశ తీర్థ స్వామీజీకి మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. వీరితో పాటు మేరీ కోమ్, చెన్నూ లాల్ మిశ్ర, అనిరుధ్ జుగ్నౌద్ కూడా పద్మ విభూషణ్ దక్కినవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!