పద్మ అవార్డ్స్ 2020 : పీవీ సింధుకు పద్మభూషణ్..

- January 25, 2020 , by Maagulf
పద్మ అవార్డ్స్ 2020 : పీవీ సింధుకు పద్మభూషణ్..

కేంద్ర ప్రభుత్వం 2020 ఏడాదికిగానూ పద్మ అవార్డులను ప్రకటించింది. క్రీడారంగంలో ప్రతిభ చూపినందుకు స్టార్ షట్లర్ పీవీ సింధును పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. సింధు సహా మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు వచ్చాయి. తెలంగాణ నుంచి చింతల వెంకట్ రెడ్డి, శ్రీభాశ్యం విజయసారథి.. ఆంధ్రప్రదేశ్ నుంచి యడ్ల గోపాలరావు, దలవాయి చలపాతి రావు పద్మ శ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.

మొత్తంగా 141 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

ఏడుగురిని పద్మ విభూషణ్, పదహారు మందిని పద్మ భూషణ్‌ అవార్డులకు ఎంపిక చేసింది.

కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, జార్జ్ ఫెర్నాండేజ్, సుష్మస్వరాజ్‌లతోపాటు కర్ణాటకకు చెందిన విశ్వేశ తీర్థ స్వామీజీకి మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. వీరితో పాటు మేరీ కోమ్, చెన్నూ లాల్ మిశ్ర, అనిరుధ్ జుగ్నౌద్‌ కూడా పద్మ విభూషణ్ దక్కినవారిలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com