పద్మ అవార్డ్స్ 2020 : పీవీ సింధుకు పద్మభూషణ్..
- January 25, 2020
కేంద్ర ప్రభుత్వం 2020 ఏడాదికిగానూ పద్మ అవార్డులను ప్రకటించింది. క్రీడారంగంలో ప్రతిభ చూపినందుకు స్టార్ షట్లర్ పీవీ సింధును పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. సింధు సహా మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు వచ్చాయి. తెలంగాణ నుంచి చింతల వెంకట్ రెడ్డి, శ్రీభాశ్యం విజయసారథి.. ఆంధ్రప్రదేశ్ నుంచి యడ్ల గోపాలరావు, దలవాయి చలపాతి రావు పద్మ శ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.
మొత్తంగా 141 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
ఏడుగురిని పద్మ విభూషణ్, పదహారు మందిని పద్మ భూషణ్ అవార్డులకు ఎంపిక చేసింది.
కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ జైట్లీ, జార్జ్ ఫెర్నాండేజ్, సుష్మస్వరాజ్లతోపాటు కర్ణాటకకు చెందిన విశ్వేశ తీర్థ స్వామీజీకి మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. వీరితో పాటు మేరీ కోమ్, చెన్నూ లాల్ మిశ్ర, అనిరుధ్ జుగ్నౌద్ కూడా పద్మ విభూషణ్ దక్కినవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







