యూఏఈ వార్నింగ్: సోషల్ మీడియాలో ఇల్లీగల్ కంటెన్ట్ అప్ లోడ్ చేసే కఠిన చర్యలు

- January 26, 2020 , by Maagulf
యూఏఈ వార్నింగ్: సోషల్ మీడియాలో ఇల్లీగల్ కంటెన్ట్ అప్ లోడ్ చేసే కఠిన చర్యలు

యూఏఈ:రేటింగ్స్ పెంచుకునేందుకు సోషల్ మీడియాలో మీ ఇష్టానుసారంగా కంటెన్ట్ అప్ లోడ్ చేస్తున్నారా? అయితే..బీ కేర్ ఫుల్. ఇక నుంచి సోషల్ మీడియా కంటెన్ట్ పై యూఏఈ ప్రత్యేకంగా ఫోకస్ చేయనుంది. ఇల్లీగల్ కంటెన్ట్ తో అప్ లోడ్ చేసే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని యూఏఈ టెలికమ్యూనికేషన్ రెగ్యూలేటరీ అథారిటీ-TRA ప్రకటించింది. అడ్డదిట్టమైన కంటెన్ట్ తో తమ వెబ్ సైట్ లో వ్యూస్, హిట్టింగ్స్ పెంచుకోవటం ద్వారా పాపులర్ అవ్వాలనే ప్రయత్నాలు తరచుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే..ఇక నుంచి అలాంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించిన TRA..ఇప్పటి వరకు అప్ లోడ్ చేసిన కంటెన్ట్ ను కూడా గడువులోగా డిలీట్ చేయాలని సూచించింది.
లేదంటే వెబ్ సైట్ నిర్వాహకులకు ఫైన్ తో పాటు యాక్షన్ కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com