బహ్రెయిన్:కాఫీ షాప్ లో పేలుళ్లు..పది మందికి గాయాలు
- January 26, 2020
బహ్రెయిన్:మాఘబా కాఫీ షాప్ లో బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో పది మంది కాఫీ షాప్ ఉద్యోగులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కిచెన్ లోని రెండు భారీ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. పేలుళ్ల సమాచారం తెలియగానే 40 మంది సివిల్ డిఫెన్స్ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అయితే..ఎక్స్ ప్లోజన్స్ చోటు చేసుకున్న సమయంలో లక్కీగా కస్టమర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుళ్లు సంభవించటంతో స్థానికులు అదిరిపడ్డారు. బ్లాస్ట్ జరిగినప్పుడు తాను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నానని...శబ్ధం రాగానే వెంటనే కిందకి దిగి తప్పించుకున్నానని కాఫీ షాప్ లోని ఓ కస్టమర్ వెల్లడించాడు. బ్లాస్టింగ్ ధాటికి కొద్దిమందికి ఒళ్లంత రక్తంతో నిండిపోయిందని, మరికొందరికి కాలిన గాయాలు అవటం తాను ప్రత్యక్షంగా చూశానని వివరించాడు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







