బహ్రెయిన్:కాఫీ షాప్ లో పేలుళ్లు..పది మందికి గాయాలు
- January 26, 2020
బహ్రెయిన్:మాఘబా కాఫీ షాప్ లో బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో పది మంది కాఫీ షాప్ ఉద్యోగులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కిచెన్ లోని రెండు భారీ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. పేలుళ్ల సమాచారం తెలియగానే 40 మంది సివిల్ డిఫెన్స్ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అయితే..ఎక్స్ ప్లోజన్స్ చోటు చేసుకున్న సమయంలో లక్కీగా కస్టమర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుళ్లు సంభవించటంతో స్థానికులు అదిరిపడ్డారు. బ్లాస్ట్ జరిగినప్పుడు తాను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నానని...శబ్ధం రాగానే వెంటనే కిందకి దిగి తప్పించుకున్నానని కాఫీ షాప్ లోని ఓ కస్టమర్ వెల్లడించాడు. బ్లాస్టింగ్ ధాటికి కొద్దిమందికి ఒళ్లంత రక్తంతో నిండిపోయిందని, మరికొందరికి కాలిన గాయాలు అవటం తాను ప్రత్యక్షంగా చూశానని వివరించాడు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు