లద్ధాఖ్‌లో తొలిసారి గణతంత్ర వేడుకలు

- January 26, 2020 , by Maagulf
లద్ధాఖ్‌లో తొలిసారి గణతంత్ర వేడుకలు

 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భారతీయ సైనికులు 17 వేల అడుగుల ఎత్తయిన లద్దాఖ్‌లో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఇండోటిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన జవాన్లు మైనస్ 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య భారతమాతకు జయజయధ్వానాలు చేస్తూ, వందేమాతరం నినాదాల మధ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన లద్ధాఖ్‌లో తొలిసారి గణతంత్ర వేడుకలు జరిగాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com